- బంకర్లలోనే రష్యా అధ్యక్షుడు
మాస్కో, మే 8: ప్రస్తుతం ఉక్రెయిన్తో యుద్ధం జరుగుతున్న క్రమంలో హత్యాయత్నాలు, డ్రోన్ దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు రావడంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ప్రాణభయం పట్టుకుంది.
దీంతో అధికారులు ఆయన భద్రతను మరింత పటిష్ఠం చేశారు. ఆయన భద్రతా చర్యలను పెంచడమే కాక, బహిరంగంగా పాల్గొనే కార్యక్రమాలను గణనీయంగా తగ్గించారు.
పలు ముందస్తు రక్షణ చర్యలు కూడా చేపట్టారని ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. ప్రస్తుతం పుతిన్ అండర్ గ్రౌండ్ బంకర్లలోనే ఎక్కువ కాలం గడుపుతున్నారని ఆ పత్రికా కథనం వెల్లడించింది. ఇటీవల రష్యా వైమానిక స్థావరాలు లక్ష్యంగా ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేయడంతో క్రెమ్లిన్ మరింత అప్రమత్తమైంది.

